ఎవరెస్ట్, MDH కంపెనీల మసాలాలు, ఇతర ఉత్పత్తుల్లో హానికర రసాయనాలు లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకటించింది. వీటి శాంపుల్స్లో ఇథిలీన్ ఆక్సైడ్ (ETO)గానీ, కాన్సర్ కారక రసాయనాలుగానీ లేవని తెలిపింది. ఈ రెండు కంపెనీలు విక్రయించే ఉత్పత్తుల శాంపిల్స్ను విస్తృతంగా సేకరించి పరీక్షలు జరపగా ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొంది.