పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ భార్య, కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ ప్రణీత్ కౌర్ ఢిల్లీలో గురువారం అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. బీజేపీకి అనుకూలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆమెను గత నెలలో కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఆమె పాటియాలాలో బీజేపీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.