నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్

నేడు వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. మే 27న జరిగిన పోలింగ్ లో 72.44 శాతం ఓటింగ్ నమోదైంది. నల్గొండ జిల్లా సమీపంలోని దుప్పలపల్లిలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. 3,36,013 బ్యాలెట్ ఓట్ల లెక్కింపును మొత్తం 96 టేబుళ్లపై చేపట్టనున్నారు. తీన్మార్ మల్లన్న (కాంగ్రెెస్), రాకేశ్ రెడ్డి (బీఆర్ఎస్), అశోక్ (ఇండిపెండెంట్) ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్