తిరుమలలో ఈనెల 16న సూర్యజయంతిని పురస్కరించుకుని జరిగే రథసప్తమికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి సందర్భంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు. అలాగే ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ దర్శన టోకెన్లు రద్దు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు.