వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టులో భారత జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. వరుస వికెట్లు పడుతున్న ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ యువకెరటం శుభ్మన్ గిల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో గిల్ 115 బంతులు ఆడి 89 పరుగులతో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. మరో బ్యాటర్ అక్షర్ (27) సైతం ఆచితూచి ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 48 ఓవర్లు ముగిసేసరికి 184/4. దీంతో భారత్ 327 పరుగుల ఆధిక్యంలో ఉంది.