1975లో జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 1977లో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఇందిరా గాంధీ పరాజయం పొందడమే కాక భారత జాతీయ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. జయప్రకాశ్ నారాయణ్ చొరవతో ‘జనతా పార్టీ’గా అవతరించిన భావసారూప్యత గల జనసంఘ్ లాంటి తదితర పార్టీలు మొరార్జీ దేశాయి ప్రధాన మంత్రిగా మొట్టమొదటిసారి ‘కాంగ్రెసేతర’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.