ఖలిస్తాన్ వేర్పాటువాదులు కెనడాలోని వాంకోవర్లో భారత కాన్సులేట్ ముందు తాజాగా నిరసన చేపట్టారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఆమెను హత్య చేసిన బాడీగార్డుల దిష్టిబొమ్మలను తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ బొమ్మకు బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయి. అనంతరం ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారత్, రష్యా జాతీయ జెండాలను మంటల్లో కాల్చారు. ఈ చర్యను భారతీయులు పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది