కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి కౌంటర్ ఇచ్చారు. అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్కు టెంపోల నిండా డబ్బులు అంది ఉంటాయన్న మోదీ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ‘చాలా ధైర్యమైన బీజేపీ ప్రభుత్వం హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేశారు. అదానీ, అంబానీలను ఎందుకు అరెస్టు చేయడం లేదు’ అని మల్లికార్జున్ ఖర్గే అన్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.