జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ సొరియాసిస్(జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో(స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మందుకు దేశీయ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించినట్లు ఈ సంస్థ వెల్లడించింది. సోరియాసిస్కు చికిత్స మాత్రమే కాకుండా బాధితుల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి ఈ మందు దోహదపడుతుందని సంస్థ వివరించింది.