టెక్ కంపెనీలు ఏఐలో మనుషుల తరహా లక్షణాలను తీసుకురావడంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐని మనుషుల్లా భావించకూడదని, దాన్ని సాధనంగా మాత్రమే ట్రీట్ చేయాలని సూచించారు. మనుషుల బంధాలను రీప్లేస్ చేయకూడదని హెచ్చరించారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే పదజాలంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ‘డిఫరెంట్ ఇంటెలిజెన్స్’గా వ్యవహరించి ఉండాల్సిందని సూచించారు.