నరేంద్ర మోదీ మూడోసారి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు వార్ మెమోరియల్ వద్ద అమరులకు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి పుష్పాంజలి ఘటించారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత, మాజీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీడీఎస్ జనరల్ అనీల్ చౌహాన్ మరియు తదితరులు పాల్గొన్నారు.