AP: మంత్రి నారా లోకేశ్ మంగళగిరి ప్రజల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్భార్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సమస్యలు, వినతి పత్రాలను స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయం సాధించాక నియోజకవర్గ ప్రజలపై తనకు మరింత బాధ్యత పెరిగిందని వెల్లడించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు.