నీట్ వివాదం.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం

నీట్-యూజీ పరీక్ష ఫలితాలపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. నీట్ ఫలితాలలో అవకతవకలు, పేపర్ లీక్ వంటి అంశాలపై సీబీఐతో విచారణ చేయించాలని పిటిషన్ దాఖలైంది. హితేన్ సింగ్ కశ్యప్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించాలని కేంద్రం, NTA ప్రతిస్పందనలను సుప్రీంకోర్టు కోరింది. దీనిపై సీబీఐ కూడా స్పందించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్