రాజస్థాన్ లోని చిత్తోర్ఘడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. పునావలి గ్రామంలో నిర్మాణంలో ఉన్న పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన కార్మికుడిని దినేష్ మేఘవాల్ గా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.