గత కొద్ది రోజులుగా తెలంగాణా రాజకీయాలు ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు, సినిమా తారలు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేటీఆర్.. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తును పర్యవేక్షిస్తారన్న నమ్మకం ఉంటే రేవంత్ కూడా ఇదే పరీక్షకు సిద్ధమా అని సవాల్ విసిరారు.