ఇజ్రాయిల్లో నెతన్యాహు బెంజామిన్ ప్రభుత్వానికి నిరసన సెగ తగిలింది. పాలస్తీనా నుంచి బందీలను విడిపించే చర్చల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వేలాది మంది ఇజ్రాయిల్ వాసులు రోడ్డెక్కారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్కు దిగారు. పీఎం నెతన్యాహు చర్యలతో ఇజ్రాయిల్ నాశనం దిశగా వెళ్తోందని ఆరోపించారు. కాగా హమాస్-ఇజ్రాయిల్ యుద్ధంలో ఈ దేశ వాసులు 1,194 మంది మరణించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.