రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ముంబై, విదర్భ జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. 538 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విదర్భ ఇంకా 290 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. క్రీజులో అక్షయ్ (56*), హర్ష్ దూబే (11*) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ముంబై 224, విదర్భ 105. రెండో ఇన్నింగ్స్లో ముంబై 418 పరుగులకు ఆలౌటైంది.