లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేవలం పరిపాలనపైనే దృష్టంతా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ సమయంలో రేవంత్ కేబినెట్ విస్తరణలో వీరికి చోటు దక్కే అవకాశం ఉందంటూ కొన్ని పేర్లు ప్రముఖంగా తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారని అంటున్నారు. ఇక నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు ఈ సారి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.