ఐసీసీ 2023 ఏడాదికిగాను మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ ను ప్రకటించింది. ఇందులో ఏకంగా ఆరుగురు భారత ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. ఈ టీం కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపికవడం మరో విశేషం. ఈ మేరకు శుభ్మన్ గిల్ ఓపెనర్, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, సిరాజ్, షమీలు 11 మందిలో చోటు దక్కించుకున్నారు. నిరుడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన భారత్, ఆస్ట్రేలియాల నుంచి ఎనిమిది మంది ఈ జట్టుకు ఎంపికయ్యారు.