ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం సీఎస్కే, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడంపై మాజీ స్టార్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడం చెన్నైకి ఉపయోగపడదని అన్నాడు. సీఎస్కే ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఇకపై అన్ని మ్యాచ్లూ ముఖ్యమైనవని, ధోనీ తన బ్యాటింగ్ ఆర్డర్ను ముందుకు మార్చుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.