2004లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి తెలంగాణలోని కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి 2004 ఏప్రిల్ 17న బెంగుళూరు నుంచి హెలికాప్టర్లో సౌందర్య బయలుదేరారు. దురదృష్టవశాత్తూ విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని క్షణాలకే కుప్పకూలి పడిపోయింది. దాంతో ఆ విమానంలో ఉన్నవాళ్ళందరూ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో సౌందర్యతోపాటు ఆమె సోదరుడు మరణించారు.