విరాట్ కోహ్లీ-సునీల్ ఛెత్రి మధ్య ఉన్న స్నేహబంధం ఫ్యాన్స్ మొత్తానికి తెలిసిందే. తాజాగా మిత్రుడు ఛెత్రి ఫుట్బాల్కు వీడ్కోలు పలకడంపై విరాట్ స్పందించాడు. మిత్రుడికి శుభాకాంక్షలు తెలిపాడు. వాస్తవానికి రిటైర్మెంట్ ప్రకటనకు ముందే తనకు ఈ విషయం వెల్లడించాడని కోహ్లీ పేర్కొన్నాడు. ఛెత్రి పోస్టుపై ‘‘నా సోదరా. గర్వించు’’ అని కామెంట్ చేశాడు.