లోక్సభ ఎన్నికల ఐదో విడత ప్రచార పర్వం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 49 నియోజకవర్గాలకు రేపు (సోమవారం) పోలింగ్ జరుగనుంది. మొత్తంగా 695 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాతో సహా పలువురు ప్రముఖులున్నారు.