పేదల ప్రతినిధినంటూ ఎన్నో వేదికలపై చెప్పుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రుషికొండపై వందల కోట్లతో తాను నివాసం ఉండేందుకు ఓ పెద్ద ప్యాలెస్ కట్టుకున్న జగన్.. అదే మాదిరిగా తన పార్టీకి చెందిన కార్యాలయాలన్నీ ఉండాలని తన అనుచర గణానికి హుకుం జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో వైకాపా కార్యాలయాల పేరుతో ప్యాలెస్ల నిర్మాణానికి పథక రచన చేశారు.