కాంగ్రెస్, ఎస్పీ సహా విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను విధిస్తారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ప్రజల ఆస్తుల్లో సగాన్ని ముస్లింలకు పంచివేస్తారని పేర్కొన్నారు. అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత రామాలయం నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్, ఎస్పీలు యాత్రా స్ధలాలను పట్టించుకుంటాయా అనిప్రశ్నించారు. ఇది వారి అజెండాలో కూడా లేదని అన్నారు.