నల్గొండ జిల్లా చర్లపల్లి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీఆర్ఎస్ ‘ఛలో నల్గొండ’ సభకు పెద్ద ఎత్తున వాహనాలు తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చర్లపల్లి వద్ద కారు వేగంగా వచ్చి పల్టీలు కొడుతూ అక్కడే ఉన్న హోంగార్డు కిషోర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు కిషోర్ నార్కట్ పల్లి పీఎస్లో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు.