పున్కున్నంలో ఉన్న కరుణాకరన్ స్మారకం “మురళీ మందిరం”ని కేంద్ర మంత్రి సురేష్ గోపి సందర్శించారు. అనంతరం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘భారతమాత’గా అభివర్ణించారు సురేష్ గోపి. అలాగే దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్ను ‘ధైర్యవంతమైన నిర్వాహకుడు’ అని కొనియాడారు. కరుణాకరన్, ఇకె నాయనార్ తన “రాజకీయ గురువులు” అని అన్నారు. కరుణాకరన్ స్మారక సందర్శన రాజకీయంగా చూడొద్దని కోరారు.