జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్- రాజౌరీ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినాయకురాలు మెహబూబా ముఫ్తీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రోడ్డు మీద కూర్చుని ఆందోళనకు దిగారు. తన పార్టీ కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లను కారణం లేకుండా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. తన సెల్ఫోన్లో అవుట్ గోయింగ్ కాల్స్ బంద్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.