హన్మకొండలో గోపాలపురం అరుణోదయ కాలనీకి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు తాటికొండ శ్రీజిత్ ప్రధాని మోడీని స్వాగతిస్తూ పెన్సిల్ పై ’నరేంద్ర మోడీ జి‘ పేరును చెక్కి తనకు ఉన్న అభిమానాన్నిశనివారం చాటుకున్నాడు. గతంలో శ్రీజిత్ వివిధ కళాఖండాలు చెక్కి అంతర్జాతీయ స్థాయి రికార్డులు పొందాడు. శ్రీజిత్ మిల్లీమీటర్ సైజులో కళాఖండాలను రూపొందించుతూ పలువురి మన్నలను అందుకుంటున్నాడు.