పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) అనుబంధ సంస్థ అయిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఉగ్ర సంస్థ కశ్మీర్ ప్రాంతంలో ఇలాంటి ఉగ్రదాడులు మరిన్ని చేస్తామని హెచ్చరించింది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా దాడులకు తెగబడతామని భీరాలు పలికిన టీఆర్ఎఫ్ ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించింది. ఉగ్రదాడి నేపథ్యంలో రియాసిలో హై అలెర్ట్ కొనసాగుతోంది.