తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు క్రమంగా ప్రవేశిస్తున్నాయి. ఆదివారం నాటికి నిజామాబాద్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో 2, 3 రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని వెల్లడించారు. ఈప్రభావం ఎక్కువగా హైదరాబాద్ పై కనిపిస్తున్నట్టు తెలిపారు. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.