రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

81చూసినవారు
రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
కోటవురట్ల మండలం రాజుపేట వద్ద సర్పా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం వీఆర్వోలు రమేష్, అనూష వెళ్లి ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని గ్రామ సచివాలయానికి తరలించారు. ఇసుక తవ్వకాలు రవాణాపై నిషేధం అమల్లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్