ధర్మవరంలోని రజకుల సమస్యలను పరిష్కరించాలని రజక సాధికార కమిటీ సభ్యులు బుధవారం కోరారు. హిందూపూర్ పార్లమెంట్ కన్వీనర్ మాల్యవంతం నారాయణస్వామి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణ రజకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్యకు, ధర్మవరం పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ. రజకులకు దోబీ ఘాట్లు, ఉచిత విద్యుత్తు, కమ్యూనిటీ హాల్ అందేలా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.