తాగునీరు ఎద్దడి నివారణకు చర్యలు

57చూసినవారు
తాగునీరు ఎద్దడి నివారణకు చర్యలు
గుత్తి పట్టణంలోని తాగునీరు ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. పట్టణంలోని 21వ వార్డు సీపీఐ కాలనీలో 7. 5 హెచ్. పి మోటారును ఏర్పాటు చేసి తాగునీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నామని చెప్పారు. మిగిలిన వార్డులలోనూ నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్