సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల ఫుట్ మార్చ్

64చూసినవారు
జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఆదేశాలతో ఉరవకొండ మండలం లత్తవరం, షేక్షానుపల్లి గ్రామాల్లో గురువారం సాయంత్రం సి. ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసులు ఫుట్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత అందరూ ప్రశాంతంగా మెలగాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్