తంబళ్లపల్లి: తగిన బస్సులు లేక ఇబ్బందులు పడిన భక్తులు

84చూసినవారు
మదనపల్లి డిపో నుండి ప్రతి సోమవారం ఉదయం 5గంటల నుంచే మల్లయ్య కొండకు బస్సులు అందుబాటులో ఉండేవి. అయితే దేవీనవరాత్రుల కారణంతో మల్లయ్య కొండకు భక్తులు భారీగా పెరిగిపోయారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా బస్సులు లేకపోవడంతో ప్రమాదకరమైన ఘాటు రోడ్లో భక్తులు ఆటోలు, జీపులను ఆశ్రయించి కొండపైకి చేరుకున్నారు. పలువురు భక్తులు బస్సులు కోసం వేచి ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్