AP: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రాజకీయాలు దరిద్రంగా ఉన్నాయని నటి పూనమ్ కౌర్ అన్నారు. పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి వ్యక్తులను ఎత్తుకెళ్లడం చాలా బాధాకరమన్నారు. పోసాని ఆరోగ్యం పట్ల తనకు దిగులుగా ఉందని, ఆయన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందన్నారు.