AP: ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు అరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఐదేళ్ల తర్వాత మళ్లీ అరకు చలి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని భావించిన ప్రభుత్వం ఇబ్బందులు పడకుండా అవరసమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అరకు ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేసింది.