ఈ నెల 23న జరిగే గ్రామ సభల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం,
జనసేన,
బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని గ్రామసభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కన్నా పిలుపునిచ్చారు.