మాచర్ల: నాగార్జునసాగర్ 20 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

64చూసినవారు
మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి 1.73లక్షల క్యూసెక్కుల భారీ వరద నీరు వస్తోంది. ఈ క్రమంలో డ్యాం అధికారులు అప్రమత్తమై ట్రస్టు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఆదివారం ఉదయం 12 గంటల వరకు 18 క్రస్ట్ గేట్ల నుంచి నీటిని విడుదల చేసి 12: 30 గంటల నుంచి 20 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589. 80 అడుగుల వద్ద ఉంది. ఇది 311 టీఎంసీలకు సమానం.

సంబంధిత పోస్ట్