ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పై పొన్నూరులో నిరసన..

69చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని వెంటనే అమలు చేయాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ డిమాండ్ చేసారు. ఆదివారం పొన్నూరు పట్టణంలో నిరసన ప్రదర్శన చేశారు. పొన్నూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జక్కా రవీంద్రనాథ్ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులతో ఉచిత ప్రయాణ పథక హామీ గురించి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్