మలేరియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

74చూసినవారు
మలేరియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి
మలేరియా వ్యాధి పట్ల గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నంజంపేట గ్రామంలోని మినీ ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అంతేకాకుండా నీటి నిల్వలు ఉన్నట్లయితే దోమలు వ్యాప్తి చెందుతాయని సిహెచ్ఓ అమర్నాథ్ తెలిపారు. రాత్రిపూట దోమతెరలను వాడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్