చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామివారి దేవాలయం వెనుక వ్యర్థాలతో తీవ్ర దుర్వాసన వస్తోంది. ఆలయ ప్రాంగణంలోని వృథా నీటిని పైపులైన్ల ద్వారా ప్రాకారం నుంచి మళ్లించి టీటీడీ అధికారులు చేతులు దులుపుకొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మురుగునీరు కల్లేటి వాగులోకి మళ్లీంచేందుకు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.