చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన నిసార్ అహ్మద్

571చూసినవారు
చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన నిసార్ అహ్మద్
మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ను గెలిపించాలని చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని కురువంక హోసన్న గాస్పల్ చర్చ్ వద్దకు ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిసార్ అహ్మద్ వెళ్లారు. చర్చి పాస్టర్ ఆహ్వానం మేరకు ప్రత్యేకప్రార్థనల్లో పాల్గొన్నారు. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ. వైసిపి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిస్వార్ధంగా సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్