మదనపల్లె కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలయింది. శనివారం సబ్ కలెక్టరేట్ నామినేషన్ కేంద్రంలో ఆర్జే హరిప్రసాద్ కు మల్లెల పవన్ కుమార్ రెడ్డి బదులు నరేంద్ర నామినేషన్ వేశారు. నరేంద్ర మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ వేసామన్నారు. సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలతో పవన్ కుమార్ రెడ్డి నామినేషన్ వేస్తారని తెలిపారు.