వైభవంగా నందీశ్వరుడికి ప్రదోష పూజలు

55చూసినవారు
పుత్తూరు పట్టణంలోని కార్వేటి నగరం రోడ్డు నందు వెలసి ఉండు శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర ఆలయంలో ఆదివారం ప్రదోషకాల పూజలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5. 00 గంటల నుండి 6. 00 గంటల వరకు ప్రదోషం నందీశ్వరుడికి విశేష అభిషేకం అనంతరం ఏకకాలంలో శివుడికి నందికి హారతి నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో శివనామ స్మరణతో ఊరేగించారు. అర్చకులు శరవనన్ పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్