ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

67చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండల పరిధిలోని గూడూరు పల్లి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఇద్దరు గాయపడ్డారు. 1033 వాహనం ద్వారా పైలెట్ జయశంకర్, ఈ ఎన్ టి వెంకటేష్, గాయపడ్డ వారిని ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. గాయపడ్డ వారి వివరాలు మునిరత్నం (45), చంద్ర( 55 )గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్