రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

4870చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. వారి వివరాల మేరకు చౌడేపల్లి నుంచి అంజన్న అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుని వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. గాయపడిన వ్యక్తిని 108 సిబ్బంది పుంగనూరుకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్