చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ వేణుగోపాలపురంలో ఆదివారం వైసీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగారు. వైసీపీకి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం నారాయణ స్వామి పిల్లనగ్రోవి వాయిస్తూ డాన్స్ చేసి కార్యకర్తలు, నాయకులను ఉత్సాహపరిచారు.