వరదయ్యపాలెం మండలం విఠయ్యపాలెం గ్రామంలో శుక్రవారం జెడి రాజశేఖర్ కుమార్తె జెడి మౌనిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమై తన తండ్రి చేసిన సహాయాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు. గత ఎన్నికలలో తన తండ్రి ఓడిపోయారని, మే 13న కూలర్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీడి మౌనిక తో పాటు కొంతమంది కార్యకర్తలు పాల్గొన్నారు.